Saturday, February 28, 2009

అనురాగ ధార

జీవన జ్యోతి ని వెలిగించే చమురు
అనురాగ ధార కాని డబ్బు కాదు.
ఎంత గొప్ప మాట.ఇది గోవిందరాజు సీతాదేవి అనురాగధార నావెల్ లో చెప్పినది.తల్లి తండ్రులు పిల్లల మద్య ,భార్యా భర్త ల మద్య వుండ వలసిన ప్రేమ,అనురాగం,బందం గురించి గొప్పగా చెప్పారు రచయిత్రి.ఇవి చాలా సున్నితమైన బంధాలు.దశరథరామయ్య,సుందరమ్మ లది బార్య భర్త లంటే శరీరాలు వేరు కాని మనసులు వక్కటే నలభయ్ ఏండ్ల సహచర్యం.మధురమైన సహచర్యం మనసులు కలసిన సహచర్యం.పరువు మర్యాదకి ప్రాధాన్యత నిచ్చేవారు.కోడలి నిరాదరణ కి గురిఅయి చేయని నేరం మోసుకొని,అర్దరాత్రి కొడుకు ఇంటినించి వెళ్ళిపోయి ఏన్నిఇబ్బందులు పడ్డా ,మోసపోయిన మనవరాలు వస్త్తే ఆదరించారు.పాత తరం వాళ్లు అనుకునే తాత గారు,నాయనమ్మల మనసులు ఇంత సున్నితమా వారి భావాలు ఇంత చక్కటివా అని అర్ధము చేసుకున్న మనవరాలి కి తాతగారు నీరు కావి పంచ ,చిరుగుల చొక్కా వేసుకున్నా తేలికగా కనిపించ లేదు.మానవ సంబంధాల గురించి చాలా ఉదాత్తం గా వివరించారు.అందు కే ఈ నవల ని డి.డి లో సీరియల్ వేసారు.నంది అవార్డు వచ్చింది.అందరు నటి నటులు బాగా చేశారట.తాతగారి పాత్రా దారి కి కుడా నంది అవార్డు వచ్చిందట.నాకు తెలియక నేను ఈ సీరియల్ మిస్ అయ్యాను.
ఈ విడదే తాతయ్య గర్ల్ ఫ్రెండ్ నవల కుడా చాలా బావుంటుంది.అందులో నూ తాతగారు మనవడి కోసం పాటు పడతారు.నాయనమ్మ రక రాకా ల పిండి వంటలు చేసుకెలు తుంది.బొంబాయి లో వా రి అనుభవాలు,అత్త కోడళ్ళ అంబంధం చాలా బాగా రాసారు.నవలంతా చాలా సరదా గా సాగి పోతుంది.
లక్ష్మి తో కలిసి ఆవిడ ఇంటికి వెళ్ళాను.బాగా ఆదరించారు.చాలా aఆక్టివ్ గా వున్నారు.ఆ విడ నే ఈ నావల్ ఇచ్చారు.త్రీ ఇఅర్స్ నుంచి గోవిందరాజు సీతాదేవి పురస్కారం పేరిట ఆవిడ అవార్డ్స్ ఇస్త్తున్నారట.ఈ సంవత్సరము కోతి-కొమ్మచ్చి రాసిన ముళ్ళపూడి వెంకట రమణ ,బాపుల కు ఇచ్చారట.వారు ఇక్కడి కి రాలేక పోయినందువలన ఈ విడ నే అక్కడి కి వెళ్లి ఇచ్చారట.ఆ ఫోటో ఆల్బం చూపించారు.వారి ఇంట్లో నే చేసారు.మాలతి చందూర్ కూడా వున్నారు.చివరి పేజి లో బాపు ,రమణ ల దంపతుల ఫొటోస్ వున్నాయి.ఎంత బాగున్నాయో.నా సెల్ నుంచి ఫోటో తేసుకోవచ్చని నాకు తోచలేదు.నేను బాపు, ముళ్ళపూడి ల ఫాన్ అని లక్ష్మి చెప్పింది.అవునా నా కు ముందు తెలిస్తే మిమ్మలి నిద్దరి ని కుడా తేసుకేల్లెదాన్ని అన్నారు.అప్పటి కి ఆవిడా నాకు పరిచయం లేరుకదా.దేని కైనా ప్రాప్తం వుండాలి.

No comments: