Thursday, February 26, 2009

జ్ఞ్యాపకం

నాన్నగారు జ్ఞ్యాపకం గా మిగిలి పోయి ఈ రోజు కి పది సంవత్సరాలు అయ్యింది.అయినా ఇంకా నాకు మాథ్స్చెపుతున్నట్లు,బజారు కి తేసి కేలు తున్నట్లు చిన్నప్పటి జ్ఞ్యపకా లే .ఖమ్మం వెళ్ళ gఆనే లూనా మీద వెళ్లి,పిల్లల కోసం స్వీట్స్ ,బిస్కెట్స్ పళ్ళు అన్ని తెచ్చేవారు.ఎండలో ఎందు కు తరువాత వెళ్ళండి అన్నా వినేవారు కాదు.వకసారి బిపు ని వెళ్ళ gఆనే లెటర్ రాయరా అన్నారు.అప్పుడు వాడు నీకు ఇంగ్లీష్ రాదు కదా తాతయ్యా అన్నాడు.పోనిలేర ఎవరి తో నయనా చదివించు కుంటాను అన్నారు.ఆ సంగతి ఎప్పుడు గురుతు చేసుకునే వారు.సంజు ఎన్ని సార్లు అడిగినా విసుగు కోకుండా దాని జాతకం చెప్పేవారు.హాబీ గా జాతకం చెప్పటము నేర్చుకున్న అందరి కి కరెక్ట్ గా చెప్పేవారు.ఎవరి దగ్గరా వక్క పైస కూడా తేసుకోలేదు.
నిన్న అనుకోకుండా యద్దనపూడి సులోచనా రాణి ఇంటికి వెళ్ళాము నేను ,లక్ష్మి.లక్ష్మి కృష్ణ మూర్తి పెదనాన్న కూతురు అని ఆవిడ కి ఆవిడ భర్త స్వామి రా వు గారికి పరిచయం చేసింది.ములుగు బాబు కుతురివా అని నన్ను చూసి సంతోషించారు.ఆయన నాన్నగారికి మేనత్త కొడుకు.కాని నాకు తెలిసి వాళ్లు ఎప్పుడు కలుసు కో లేదు.వై.ఎం .సి దగ్గర వున్నప్పుడు దూరము నుండే ములుగు బాబు రావటము చూసే వాళ్ళము.వాడు వచ్చి నప్పుడు అందరమూ ఎంజాయ్ చేసే వాళ్ళము.వాడు, నేను,రాముడు బావ అంటు ఇంకా కొంతమంది పేర్లు చెప్పారు అందరమూ చాలా ఫ్రెండ్స్ మీ .అందరు వెళ్లి పోయారు నేను వక్క డి నే మిగిలాను అని బాధ పడ్డారు.అనుకోకుండా నాన్నగారి తిది ముందే అక్కడి కి వెళ్ళటము,నాన్నగారి చిన్ననాటి ముచ్చట్లు వినటము మంచిగా అని పించింది.
నాన్నగారు అందరి తో బాగానే వుండేవారు.ఆయన మీద ఎవ్వరు చెడు గా చెప్పటము వినలేదు.ఎప్పుడు తామరాకు మీద నీటి బొట్టు లాగా వుండాలి అని చెప్పేవారు.అనవసరము అయిన మాటలు ఏవి మాట్లాడే వారు కాదు.అల్లుళ్ళ తో కుడా ఫ్రెండ్స్ లాగా వుండేవారు.ఈయన తో సినిమాలకు కూడా వెళ్లేవారు.మా వారు నన్ను నాన్న కుచి అంటుంటే ముసిముసి గా నవ్వు కునే వారు.ఆయన మరణించిన తరువాత అప్పుడప్పుడు జయ కి కలలో కనిపిస్తున్నారు.వకసారి ,కమలని వినాయకు డి పూజ చేయమ న్నను.నువ్వు గుర్తు చేయి అన్నారట.ఆయన చెప్పింది నేను ఎవరికీ చెప్పలేదు,మరచిపోయాను.చివరికి మరణము తరువాత కూడా నా గురించిఆలోచిం చారన్న మాట.నేను ఆయనకి తిరిగి అంత ప్రేమ అందిచ గలిగానా.ఆయనకు నేను ఏమి చేయలేక పోయాను.అయన జబ్బు పడ్డప్పుడు కూడా నేను ఇక్కడ లేను అమెరికా లో వున్నాను.ఆయన మరణించే ముందు పనమ్మాయి తో నన్ను రమ్మని కబురు చేసారు.వేలుదామని బయిలు తెరాను కింది కి వెళ్ళే సరి కి చుతి కి కోసం ఆగవలసి వచ్చింది.ఇంత లో ఎవరో మాటలు పెట్టారు.సరే లేట్ అయ్యింది కదా వంట చేసు కొని పోదామని తిరిగి వెళ్లి వంట చేస్తుండగా ఆయన మాట్లాడటము లేదని పక్కిన్ టి వాళ్ళు ఫోన్ చేసారు మేము వెళ్ళే సరికి అయన పోయారు .నేను తిరిగి వేల్లకుడా అప్పుడే అక్కడి కి వెళ్లి వుంటే ఆకరి చూపు దక్కేది కదా అయన రమ్మని పిలిచినా వెల్ల లేదే అని ఎప్పుడు బాధ పడతాను.కాని ,వకటే తృప్తి ఆయన కర్మ కాండలు మా వారు చేసారు.దాని కి నేను ఎప్పుడు మా వారికీ క్రుతగ్యు రాలీని.
నేను ట్టు తౌసండ్ ఇయర్ చూడను అని వక సారి నాతో అన్నారు కాని అప్పుడు ఆయన అన్నది నాకు అర్దము కాలేదు.ఆయన న్యంటి నయన్ ఫిబ్రవరి లో పరమపదిన్ చినప్పుడు అర్దము అయ్యిది.ఆయన మరణము గురించి ఆయన కే తెలిసిన యోగి ఆయన.

No comments: