అంతర్జాతీయ
మహిళా దినోత్సవం .
అది
2009 మార్చ్ 8.పొద్దున మా చెల్లెలు ఫోన్
చేసి"అక్కా ఈ రొజు ఆంధ్రజ్యోతి
పేపర్ లో బ్లాగ్ ల
గురించి ఇచ్చారు చూసావా ?" అంది.ఎక్కడా ఇంకా
పని కాలేదు చూస్తాను అని వెంటనే చూసాను.అరుణాపప్పు అందులో బ్లాగ్ ల గురించి, అందులో
మహిళా బ్లాగుల గురించి రాసింది.దానిలోనే "కూడలి" అనే చోట అన్ని
తెలుగు బ్లాగ్ ల పోస్ట్ లు
ఏ రోజు వి ఆ
రోజు వస్తాయని చదివి కూడలి లో నా బ్లాగ్
కూడా చేర్చాను.అలా అలా కూడలి లో అన్ని బ్లాగ్
లల్లో విహరిస్తూ ఉండగా "థాంక్ యు" అని ఓ పోస్ట్
కనిపించింది.థాంక్ యు మీద పోస్ట్
నా అని చదివి అందులో
నా అభిప్రాయం కూడా వ్రాసాను.దానికి
ఆ బ్లాగర్ సమాధానం ఇచ్చింది.ఇద్దరమూ దాని గురించి కాసేపు
చర్చించుకున్నాము.అదో అలా పరిచయం
అయ్యింది, ఆ బ్లాగర్, మా
గురూజీ జ్యోతి వలబోజు. ఓ రోజు మాలా
గారు ప్రమదావనం లో చేరుతారా అని
అడిగింది.నాకు అలా చేరటం
ఇష్టమేనండి కాని నేను బయటకు
మీటింగ్ ల కు రాలేను.అన్నాను.మీరు బయటకు రానవసరం
లేదు మేయిల్ లోనే అన్నరు.మేయిల్
లో ఏమిటీ అని తెగ హాచర్యపోయి
సరే అన్నాను.ప్రమదావనం ఎవరిని చూసినా తెగ ఆశ్చర్యం వేసేది.అందరూ బ్లాగ్ లు చాలా బాగా
వ్రాసేవారు. జ్ఞాన ప్రసూన గారి చూసి చాలా
ఆశ్చర్యంగా ఉండేది.రచనలు, పేంటింగ్ లు, బొమ్మలు చేయటము
ఒకటారెండా ఆవిడ కు రాని
విధ్యలేదు.లక్ష్మీ రాఘవ గారు, జి.యస్ లక్ష్మి గారు,
సి.ఉమాదేవి గారు, సుభద్రావేదుల ఇలా అందరూ మంచి
రచయిత్రులే! వాలు కొబ్బరిచెట్టు సుభద్ర
కోనసీమ కబుర్లు చక్కగా చెప్పేది కృష్ణవేణి
ఒక్కతే హిమాలయాలల్లో ట్రెక్కింగ్ కు వెళుతుంది అంటే
అమ్మో అనుకునేదానిని.! ఇక మమత పొటోషాప్
లో ఎక్స్పర్ట్.తన దగ్గర ఫొటో
షాప్ నేర్చుకున్నాను.బయట 50000 వేలు ఫీజు అడిగారు.పాపం ఒక్క పైసా
తీసుకోకుండా చక్కగా నేర్పింది మమత :) ఇలా మా ప్రమదావనం
లో అందరూ ఒక్కొక్కదానిలో ప్రావీణ్యులే సరే రోజూ బోలెడు
కబుర్లూ జోక్ లూ , పుట్టిన
రోజు వేడుకలూ ఎన్ని సంబరాలో! ఇలా మేమందరమూ కాస్త
ఆదమరిస్తే చాలు మా గురూజీ
కొరడాతో వచ్చేసేది.పిల్లలూ ఈ వారం ఎవరెవరు
ఎన్ని పోస్ట్ లు వేసారు? ఇదో
ఈ వారం అందరూ ఈ
సబ్జెక్ట్ మీద వ్రాయండి అనేది.దేవుడా అనుకుంటూ రాసేసేవాళ్ళము.అలా ఓ గొలుసు
కథ కూడా రాసాము.గొలుసు
కథ ఎవరు మొదలు పెట్టాలి
, ఎవరి తరువాత ఎవరు రాయాలో షెడ్యూల్
ఇస్తూ నా పేరు కూడా
చేరుస్తే షరా మామూలే గజ
గజా! అబ్బే వింటేనా మహా మొండిది వ్రాయించింది.అంతేనా ? రాతలూ , కబుర్లూ, ప్రోగ్రాం
లే కాదు, వరూధిని సమాజ సేవ ప్రోగ్రాంలు
ఫిక్స్ చేసేది.అందరమూ ఎవరికి తోచింది వాళ్ళు ఇస్తే ఆ డబ్బులు అవసరము
ఉన్నవాళ్ళకు పంపేది.అలా చాలా మందికే
ఇచ్చాము.ఓసారి ఓల్డేజ్ హోం లో కూడా
ఇచ్చాము.ఓ సారి చలికాలం
ఫుట్ పాత్ మీద పడుకున్న
బిచ్చగాళ్ళకు దుప్పట్లు కూడా పంచాము.చెప్పాలంటే
మా ప్రమదావనం ముచ్చట్లు చాలా ఉన్నాయి.
నా బ్లాగ్ ప్రస్థానం లో జ్యోతి సహాయము
చాలా ఉంది.సింపుల్ గా
ఉండాలని టెంప్లెట్ తెల్ల పేపరే పెట్టుకున్నాను. కాని అలా బాగుండదు,
మీ పోస్ట్ లు చదవాలంటే కొంచం
అట్రాక్టివ్గా ఉండాలి అని మార్చింది.సరే
తరువాత మా కోడలు నాకు
కావలసినట్లుగా డిజైన్ చేసింది అది వేరే విషయము
:) నేను పోస్ట్ చేయటం ఆలశ్యం, మాలాగారు ఎన్ని తప్పులు వ్రాసారో చూసుకోండి అని మైల్ వచ్చేసేది!
అబ్బ నన్ను చీల్చిచెండాడేస్తున్నావు తల్లీ అని విసుకున్నా ఊరుకునేదికాదు.కొన్ని బ్లాగ్స్ లింక్స్ ఇచ్చి వాళ్ళు ఎలా వ్రాసారో చదవండి
అనేది.మీరు బాగా రాస్తున్నారు
కాని ఇంకా బాగా రాయాలి
అని నా రచనలకు పదును
పెట్టింది జ్యొతినే! పోస్ట్ లో లింక్స్ ఇవ్వటమూ,
పిక్చర్స్ ఇన్సర్ట్ చేయటమూ , పాటల లింక్స్ ఇవ్వటమూ
ఇలా ఒకటేమిటీ ప్రతిదీ జ్యోతి నే నాకు నేర్పించింది.
యూ ట్యూబ్ గురించీ తనే చెప్పింది.అందుకే
జ్యోతి ని గురూజీ అని
పిలుచుకుంటాను.అబ్బ ఎన్ని పనులు
చేస్తుందో ఎంత ఓపికో అనుకునే
దానిని. మొదటి సారి జ్యోతి ని
ఓల్డేజ్ హోం కు వెళ్ళేటప్పుడు
కలిసాను.మీరు అమీర్పేట్ చందనా
బ్రదర్స్ దగ్గర ఉండండి , పికప్ చేసుకుంటాను అన్నది. నా ముందు జీప్
ఆగి , అందులో నుంచి జ్యోతి దిగినప్పుడు ఆమె ఫొటో చూసి
ఉండటంవల్ల గుర్తుపట్టి అలా చూస్తూ ఉండిపోయాను.మీరు మాలాగారే కదా
రండి అంది.నేను కదలకుండా
అలానే చూస్తూ ఉంటే ఏమీటీ అలా
చూస్తున్నారు రండి అంది.మీకు
రెండు చేతులు , ఒక్క తలే ఉందే
అని అప్రయత్నం గా అనేసాను.తను
ఆశ్చర్య పోయి , ఏమిటీ నన్ను రాక్షసిని అనుకుంటున్నారా అని అడిగింది.అప్పటికి
సద్దుకొని కాదు కాదు అన్నాను.అలా మేము మొదటిసారి,
అమీర్ పేట్ చందనా బ్రదర్స్
ముందు కలుసుకున్నాము.
అప్పటి
వరకూ ఓల్డేజ్ హోం కు వెళ్ళినప్పుడూ,
సుజాతాగారింట్లో గెట్ టుగేదర్ లో
నూ ప్రమదావనం సభ్యులం కొద్దిమందిమే కలిసాము.అలా కాదు అందరమూ
మంచి ఫ్రెండ్స్ మి అయ్యాము ఓసారి
కలుద్దాం అనుకున్నాము.జ్ఞానప్రసూనగారు బూరెలు పెడతాను మా ఇంటి కి
రండ ర్రా పిల్లలూ అన్నారు.అంతే అందరమూ పొలో
మంటూ వాళ్ళింట్లో వాలిపోయాము.psm.లక్ష్మి గారిని,g.s,లక్ష్మి గారు, ఉమాదేవి గారు అందరూ అప్పుడే
పర్సనల్ గా పరిచయం అయ్యారు.ఆ పరిచయం మంచి
స్నేహంగా మారి , నన్ను రచయిత్రిగా మార్చింది :) కలిసినప్పుడల్లా, ఒక్కోసారి ఫోన్ చేసి మరీ psm లక్ష్మి మీరు కథలు వ్రాయండి
అని పోరేవారు.ఓసారి మేము నలుగురమూ మా
ఇంట్లో కలుసుకున్నప్పుడు ముగ్గురూ నన్ను వేధించేసారు రాయాల్సిందే అని.మేము సహాయం
చేస్తాము అన్నారు g.S,లక్ష్మి, ఉమాదేవి.అన్న మాట నిలబెట్టుకున్నారు.అమ్మో G.S లక్ష్మైతే జ్యోతి ని మించి స్ట్రిక్ట్.రోజూ ఎంతో కొంత
రాసి పంపాల్సిందే.వక్క రోజు బద్దకించినా
, ఈ రోజు మీరేమీ రాసి
పంపలేదు అనేవారు.రోజూ ఏమి రాయండీ
అంటే ఏదో ఒకటి.అన్నం
తిన్నాను.పడుకున్నాను అనైనా రాయండి అనేవారు.ఏమండీ తో పొట్లాట వచ్చింది
అని కూడా రాయనా అంటే
రాయండి అన్నారు.ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్ లో హోం వర్క్
చేసాను.మళ్ళీ ఇన్నేళ్ళ కి మమత, లక్ష్మిగారు
నాతో హోం వర్క్ లు
చేయించారు.అలా రచన ఒక
వ్యసనం ఐపోయింది.రోజూ కొంచమైనా ఏదో
ఒకటి రాయాల్సిన పరిస్థితి వచ్చింది :) ఓ రోజు సి.ఉమాదేవి గారు లేఖిని కి
తీసుకెళ్ళి, బళ్ళో పిల్లలను చేర్చినట్లు ఫీజ్ కట్టి చేర్చి
రచయిత్రి ని అనిపించారు!
ఈ మహిళాదినోత్సవం రోజున వీరందరినీ తలుచుకోవటం సముచితం గా భావిస్తున్నాను. సాహితీ
వనం లో ఓ చిరు
మొక్కగా నన్ను తీర్చిన,జ్యోతి,పి.యస్.యం.
లక్ష్మి,జి.యస్.లక్ష్మి,సి.ఉమాదేవి గారు, మమత ల కు ,ఈ అభివృద్ధికి
కారణమైన ప్రమదావనం కు, ప్రమదావనం స్నేహితులకు
ధన్యవాదాలు.
అందరికీ
అంతర్జాతీయ మహిళాదినోత్సవ శుభాకాంక్షలు.
2 comments:
మీ బ్లాగ్ జ్ఞాపకాలు,విశేషాలు చాలా బాగున్నాయండి :)
మీకు కూడా మహిళాదినోత్సవ శుభాకాంక్షలు.
మీ ప్రమదావనపు ప్రమదల కబుర్లు ప్రమోదభరితంగా వున్నాయి 👏
Post a Comment